Search
Close this search box.

  గ‌ల్ఫ్ కార్మికుల‌కు ఎక్స్‌గ్రేషియా.. సీఎం ఆదేశాలు

గ‌ల్ఫ్ కార్మికుల కోసం సీఎం రేవంత్ సాయం

గల్ఫ్ దేశాల‌లో ఉన్న కార్మికుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న‌ట్టు తెలంగాణా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం గల్ఫ్‌ కార్మికుల కుటుంబాలకు శుభ‌వార్త చెప్పిన‌ట్లైంది. రాష్ట్రం నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రూ.5 లక్షల చొప్పున, 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని నిధుల విడుద‌ల‌కు ఉత్త‌ర్వులు ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబాలకు కొండంత ఊర‌ట ల‌భించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు