ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మొదటి సం విద్యార్థులకు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి.ఉదయం9నుంచి12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.రెండో ఏడాది పరీక్షలు 24న ప్రారంభమవుతాయి.మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి.అయితే మార్చి 3న జరగాల్సిన రెండో ఏడాది మ్యాథ్మెటిక్స్, సివిక్స్ పేపర్లు మార్చి 4న, మార్చి 20న ప్రకటించిన మొదటి ఏడాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,లాజిక్ పేపర్లు మార్చి 21న నిర్వహిస్తారు.మార్చి 3న హోలీ,మార్చి 20 రంజాన్ సెలవులు ఉండడంతో ఈ మార్పులు చేశారు.మిగిలిన పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి.









