Search
Close this search box.

  మొంథాపై అప్ర‌మత్తంగా ఉండండి : డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

www.aditya369.net

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ , స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ , జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ , జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు