కరప మండలంలోని గురజనాపల్లిలోని హైస్కూ లో పదవ తరగతి విద్యార్థులకు హైదరాబాద్ క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారు రూ.25,000 విలువైన పరీక్షా సామాగ్రి అందజేశారు.హెచ్ఎం ఏ సాయి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 70 మంది విద్యార్థులకు మండల విద్యాధికారి పి. సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఐ. ప్రసాదరావు,గ్రామ పంచాయతీ వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం,ఎంపీటీసీ సభ్యురాలు వై. వీరవేణి, ఎస్ఎంసీ ఛైర్మన్ పి. నూకరాజు, ఉపాధ్యాయులు వివి రమణమూర్తి, శోభాకర్, పి. భవాని, ఎం. ప్రభారాణి, టి. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.








