ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి వెంకటాపురం డా బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో చికెన్ పాక్స్,కండ్లకలక నివారణకు హోమియోపతి మందుల ఉచిత పంపిణి,అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో యంబియం మల్టీస్పెషాలిటీ హోమియో క్లినిక్ కు చెందిన పిల్లల వైద్య నిపుణులు పి ఉమా మహేశ్వరి పాల్గొని చికెన్ పాక్స్ వ్యాధి లక్షణాలు,వ్యాప్తి చెందే విధానం,తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి శశికళ,హెల్త్ సూపర్వైజర్ జి చక్రమ్మ, ఉపాధ్యాయులు,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.









