వరుసకు మామైన వ్యక్తిని హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కాకినాడ జిల్లా 12వ అదనపు పిఠాపురం జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీ హరి తీర్పునిచ్చారు. తుని మండలం సీతారామపురంలో 2019లో జరిగిన ఈహత్య ఘటనకు సంబంధించి తీర్పు వెలువ డింది.నల్లమిల్లి రాజారాడ్డి అనే వ్యక్తి తనకు వరుసకు అల్లుడైన కర్రి మార్రెడ్డితో కలిసి వడ్డీ వ్యాపారం చేసేవాడు. మార్రెడ్డి, రాజారెడ్డికి తెలియకుండా రూ.15 లక్షలు నగదు వాడుకున్నాడు. వ్యాపారంలో లెక్కల్లో తేడాలు రావడంతో రాజారెడ్డి, మార్రెడ్డిని నిలదీశాడు.
దీంతో మార్రెడ్డి తన తప్పు మన్నించమని చెప్పి, నగదు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. డబ్బు ఇచ్చేందుకు ఇష్టపడని మార్రెడ్డి, రాజారెడ్డిని అంతమొంచిందేకు ప్రణాళిక చేసుకున్నాడు. 2019, నవంబర్ 26న రాత్రి 12 గంటల సమయంలో మారెడ్డి, రాజారెడ్డిని వెదురుకర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలై రాజారెడ్డి చనిపోయాడు. అప్పటి తుని సిఐ గా పనిచేసిన జి.రమేష్బాబు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. పూర్వ పరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు మార్రెడ్డికి యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున బత్తిన లక్ష్మణదొర వాధించారు.









