రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణా భివృద్ధి, సాగునీటి వనరుల సంరక్షణ, రహదారుల నిర్మాణం,తాగునీటి సదుపాయాలు వంటి అంశాలపై వేగంగా చర్యలు చేపడుతోందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఓఎం గ్రాంట్ ద్వారా రూ.7 లక్షల 55 వేల వ్యయంతో నడుకుదురు నుంచి పెనుగుదురు వరకు మైనర్ డ్రైన్ పూడికతీత పనులను,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.8 లక్షల 50 వేల వ్యయంతో సరోజని నగర్లో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామ చంద్రరావు,శ్రీనివాస్,ప్రసన్నకుమార్,ఏఎంసీ చైర్మన్ రమేష్, జనసేన మండల అధ్యక్షుడు మురళి, కరప డిసిబి చైర్మన్ పి గంగ సత్యనారాయణ,ఆత్మ చైర్మన్ చంద్రశేఖర్,నీటి సంఘం డైరెక్టర్ గోవింద్, సొసైటీ అధ్యక్షులు శంకర్,నారాయణరావు,నారాయుడు,శాంత,తాతాజీ, అన్నవరం,రాంబాబు,నానిబాబు,హరనాథ్,గోవింద్,అధికారులు పాల్గొన్నారు.







