సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంబ పాత్రలో కనిపించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఎప్పుడు వదులుతావు జక్కన్నా?
అయితే సినిమా విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ.. అసలు అప్డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ మహేష్ అభిమానులు మాత్రం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ‘గ్లోబ్ట్రాటర్’ పేరుతో వచ్చిన ఈవెంట్లో విడుదల చేసిన గ్లింప్స్ తప్ప పెద్దగా మరో అప్డేట్ రాలేదు.
ముఖ్యంగా మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి ఏదైనా సాలిడ్ ట్రీట్ వస్తుందని ఘట్టమనేని అభిమానులు భారీగా ఆశించారు. టీజర్ వస్తుందని కొందరు, సాంగ్ రిలీజ్ అవుతుందని మరికొందరు, మేకింగ్ వీడియో వస్తుందని ఇంకొందరు.. ఇలా రకరకాల అంచనాలు పెరిగిపోయాయి.
కానీ చివరకు అభిమానుల అంచనాలకు భిన్నంగా కొన్ని స్టిల్స్తోనే సరిపెట్టారు మేకర్స్. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
దసరాకు బిగ్ అప్డేట్ వస్తుందా?
ఇక ఇప్పుడు మరోసారి ‘వారణాసి’ నెక్స్ట్ అప్డేట్పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి వచ్చే విజయదశమి సందర్భంగా సినిమా నుంచి భారీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. దసరా నుంచి ‘వారణాసి’ ప్రమోషన్స్ను మరింత వేగవంతం చేసి, వరుసగా అప్డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఫిలిం సర్కిల్స్లో జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై మహేష్ అభిమానులు మాత్రం పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదు.
‘ఇదీ మరో బిస్కెట్టేమో’ అంటూ కౌంటర్లు!
ఎందుకంటే ‘వారణాసి’ విషయంలో ఇలాంటి అప్డేట్ బజ్లు గతంలో కూడా చాలానే వచ్చాయి. “త్వరలో భారీ అప్డేట్”, “స్పెషల్ డే రోజున సర్ప్రైజ్”, “ఫ్యాన్స్కు ట్రీట్ రెడీ” అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
కానీ చివరకు చెప్పిన స్థాయిలో ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో నిరాశే మిగిలింది.
అందుకే ఇప్పుడు దసరాకు బిగ్ బ్లాస్ట్ అంటూ వస్తున్న వార్తలపై ఘట్టమనేని అభిమానులు.. “అప్డేట్ వస్తుందన్న అప్డేట్ ఎందుకు దొరా? ఏదో ఒకటి డైరెక్ట్గా ఇచ్చేయొచ్చు కదా!” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు.
“ఈసారి నిజంగానే బ్లాస్ట్ అవుతుందా? లేక ఇది కూడా మరో బిస్కెట్టేనా?” అంటూ సెటైర్లు కూడా పేలుస్తున్నారు.
మార్చి 7న వరల్డ్వైడ్ రిలీజ్
ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
మరి ఇంతకీ దసరాకు నిజంగానే ‘వారణాసి’ నుంచి భారీ అప్డేట్ వస్తుందా? లేక ఎప్పటిలాగే ఇది కూడా మరో రూమర్గానే మిగిలిపోతుందా? అనేది చూడాలి.









