ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం “ది ఒడిస్సీ” థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఇండియాలోనూ భారీ స్పందనను దక్కించుకుంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, “ది ఒడిస్సీ” తొలి రోజు భారతదేశంలో రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు ఇది మంచి ఆరంభంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలాంటి సూపర్హీరో ఫ్రాంచైజీ లేదా సీక్వెల్ హైప్ లేకుండానే కేవలం క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్ విలువతోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషం.
అంతేకాకుండా, ఇండియాలో IMAX వెర్షన్కు ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ కనిపిస్తోంది. చాలా నగరాల్లో IMAX షోలు అడ్వాన్స్ బుకింగ్స్తోనే హౌస్ఫుల్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు వసూళ్లలో IMAX స్క్రీన్ల వాటా కూడా గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి నోలన్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద పనిచేసిందనే చెప్పాలి. ఇక వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు నమోదు చేస్తుందో ఆసక్తికరంగా మారింది.







