అర్ధరాత్రి సమయంలో బస్సు దిగి దారి తెలియక ఇబ్బందుల్లో పడ్డ ఓ యువతి కి 112 ఫోన్ కాల్ ద్వారా క్షేమంగా తిరిగి హాస్టల్ కు చేరింది. శ్రీకాకుళం జిల్లా నందవకొత్తూరు గ్రామానికి చెందిన జ్ఞానేశ్వరి కాకినాడలో హాస్టల్లో ఉంటూ , నీట్ కోచింగ్ తీసు కుంటుంది. శుక్రవారం పలాస నుండి విశాఖపట్నం మీదుగా ఆమె కాకినాడ బయలుదేరింది. ప్రయాణంలో ఆమె బస్సులో నిద్రపో యింది. పిఠాపురం పాదగయ సెంటర్ కు వచ్చేసరికి ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లేవారు దిగాలని కండక్టర్ పిలుపుతో కంగారులో పాదగయ సెంటర్లో దిగేసింది. అప్పటికే అక్కడ ఉన్న ఒక ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్టాండ్ కు యువతిని తీసుకువెళ్లి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే పిఠాపురం బస్టాండ్ కావడంతో అక్కడ చీకట్లో ఎవరు లేకపోవ డంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే యువతి తన అన్నయ్యకు ఫోన్ చేయడంతో అతడు 112 కి ఫోన్ చేశాడు. పిఠాపురం పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ లో వద్ద ఉన్న యువతీని క్షేమంగా కాకినాడ హాస్టల్ కు తీసుకువెళ్లి అప్పగించారు.









