‘ది రాజాసాబ్’ తర్వాత దర్శకుడు మారుతి తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ సినిమా విడుదల అనంతరం కొంతకాలం సైలెంట్గా ఉన్న మారుతి, ఇప్పుడు తన కొత్త కథతో మరో హీరోను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే శ్రీరామ నవమి సందర్భంగా తన కొత్త స్క్రిప్ట్ సిద్ధమైందని మారుతి స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడంతో, తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ సినీ జర్నలిస్టు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. మారుతి కొత్త ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని ఆయన పేర్కొనడంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇదే జర్నలిస్టు గతంలో ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించిన పలు అప్డేట్స్ను కూడా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఆయన చెప్పిన సమాచారం నిజమే కావొచ్చనే చర్చ జరుగుతోంది.
అయితే మారుతి కొత్త సినిమా ఏ హీరోతో ఉండబోతోంది? స్టార్ హీరోనా? లేక యంగ్ హీరోతోనా? అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి మారుతి తదుపరి ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ లభించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే… మారుతి తన కొత్త సినిమాను ఏ హీరోతో ప్రకటిస్తారు? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అన్నదే.








