ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది.వడోదరలోని కోటంబి స్టేడియంలో 1వ మ్యాచ్ ఫిబ్రవరి14న మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.స్పోర్ట్స్ టీవీ ఛానెల్ లలో మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
ఇక టీమ్స్ విషయానికి వస్తే.. బెంగళూరులో కెప్టెన్ స్మృతి మంధాన, ఆలిస్ పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు గుజరాత్ లో శుభమన్ గిల్ స్నేహితురాలు హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్, డియాండ్రా డాటిన్ వంటి స్టార్ ఆటగాళ్ళు ఉండడంతో మొదటి మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.
ప్రస్తుతం స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్లో ఉంది. గత సీజన్లో తన జట్టుకు టైటిల్ను కూడా గెలుచుకుంది.అందుకే ఈసారి వారు నమ్మకంగా ట్రోఫీలో అడుగుపెడుతున్నారు.