కరపలో కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటి వైద్య శిబిరాన్ని సినియర్ నాయకులు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ(పండు) ఆధ్వర్యంలో ఎఎస్ ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించారు.మొత్తం 330 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో కళ్లజోడు అవసరమైన 150 మందికి పండు తన తను స్వయంగా సమకూర్చిన యాళ్ల పండు స్వగృహం నందు బుధవారం ఉచితంగా భోగి రెడ్డి కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్,భోగిరెడ్డి గంగాధర్ ,పేపకాయల పవన్ కుమార్ పేకేటి దుర్గాప్రసాద్,, బైల నూకరాజు చిన్నారి శ్రీను ,కసిలింక సతీష్, టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.








