పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ఆధ్యంతం, ఆసక్తికరంగా జరిగింది. పిఠాపురం పట్టణ అధ్యక్ష స్థానం మహిళకు కేటాయించడంతో ఆ స్థానానికి పోటీపడ్డ డాక్టర్ చిక్కాల(రావుల) వరలక్ష్మీ విజయం సాధించారు. ఉపాధ్యక్ష స్థానం బాలిపల్లి అనిల్ దక్కించుకున్నారు. పిఠాపురం మండల పార్టీ అధ్యక్షుడిగా వెన్నా జగదీష్(జల్లూరు), ఉపాధ్యక్షుడిగా నిమ్మన దుర్గప్రసాద్ (చిత్రాడ), గెలుపొందారు.

గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడిగా మామిడాల సూరిబాబు, ఉపాధ్యక్షుడిగా కడారి సూర్యచంద్ర సత్యనారాయణ విజయం సాధించారు. గొల్లప్రోలు మండల పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల శ్రీనివాస్(దుర్గాడ), ఉపాధ్యక్షుడిగా పాలశెట్టి తమ్మారావు (వన్నెపూడి) విజయం సాధించారు. ఓటింగ్ విధానంలో గెలుపొందిన వీరిని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ అభినందనలు తెలిపారు. కొత్తపల్లి మండలం ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు.










