Search
Close this search box.

  28న ఏపీ బడ్జెట్

ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. అసలు అయితే ఈ బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన ప్రవేశ పెట్టాలని ముందుగా నిర్ణయించారు.కానీ బడ్జెట్‌ను నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.24వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాల ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.అలాగే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది.అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు