కాకినాడ జిల్లాలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు , కొత్త కుళాయిలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. డ్రింక్ ఫర్ ట్యాప్ పేరిట సర్వే నిర్వహిస్తోంది. ఒక ఇంటిలో ఉన్న కుళాయి కనెక్షన్ ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, తాగునీరు సరిపోతుందా లేదా అనే అంశాలను ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్లకు ఈమేరకు త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి








