ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పాసుల గోలతో రచ్చ రచ్చ అవుతుంది. ఈనెల 30న పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలకు పవన్ 12 వేల చీరలు పంపిణీ చేస్తున్నారని విస్తృతమైన ప్రచారం జరిగింది. వ్రతాలలో పాల్గొనే వారికి ఇచ్చే పాసుల విషయంలో సరైన విధానం లేకపోవడంతో మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.









