Search
Close this search box.

  సినీ పరిశ్రమలో విషాదం..! షావుకారు జానకి కన్నుమూత..!

August 21, 2026 8:40 PM | Aditya369 News

సినీ పరిశ్రమలో విషాదం..! షావుకారు జానకి కన్నుమూత..!

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19న ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో వైద్యులు ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ.. ఆగస్టు 21 మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన షావుకారు జానకి మరణవార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తల్లిగా, బామ్మగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కలిపి 400కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘బాబు బంగారం’, ‘కంచె’ వంటి పలు తెలుగు చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. వయసు పెరిగినా నటనపై ఆసక్తిని కొనసాగిస్తూ.. కొత్త తరానికి కూడా తన ప్రతిభను పరిచయం చేశారు.

షావుకారు జానకి కళారంగంలోకి అడుగుపెట్టింది రంగస్థలం ద్వారా. నాటకాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆమె 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో విడుదలైన తెలుగు చిత్రం ‘షావుకారు’ ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటిపేరుగా మారి ‘షావుకారు జానకి’గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిపోయారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో భాషల్లో, విభిన్నమైన పాత్రల్లో నటించిన ఆమె దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక దిగ్గజ నటిగా గుర్తింపు పొందారు.

సినీ రంగానికి ఆమె అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా నంది అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘కలైమామణి’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.

దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి మరణంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె పోషించిన పాత్రలు, సినీ రంగానికి అందించిన సేవలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇక లేరు. 94 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19న ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో వైద్యులు ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ.. ఆగస్టు 21 మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన షావుకారు జానకి మరణవార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తల్లిగా, బామ్మగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కలిపి 400కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘బాబు బంగారం’, ‘కంచె’ వంటి పలు తెలుగు చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. వయసు పెరిగినా నటనపై ఆసక్తిని కొనసాగిస్తూ.. కొత్త తరానికి కూడా తన ప్రతిభను పరిచయం చేశారు.

షావుకారు జానకి కళారంగంలోకి అడుగుపెట్టింది రంగస్థలం ద్వారా. నాటకాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆమె 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో విడుదలైన తెలుగు చిత్రం ‘షావుకారు’ ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటిపేరుగా మారి ‘షావుకారు జానకి’గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిపోయారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో భాషల్లో, విభిన్నమైన పాత్రల్లో నటించిన ఆమె దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక దిగ్గజ నటిగా గుర్తింపు పొందారు.

సినీ రంగానికి ఆమె అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అంతేకాకుండా నంది అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘కలైమామణి’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.

దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి మరణంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె పోషించిన పాత్రలు, సినీ రంగానికి అందించిన సేవలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు