బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఇక తాజాగా ‘రామాయణ’ క్లైమాక్స్కు సంబంధించిన వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్ర క్లైమాక్స్ను ఇప్పటివరకు భారతీయ సినిమాలో చూడని స్థాయిలో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథలోని కీలక భావోద్వేగాలు, అడ్వెంచర్ అంశాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ క్లైమాక్స్లోనే పీక్స్కు చేరుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో క్లైమాక్స్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు తెరపై ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేలా ఉండబోతున్నాయని టాక్. దీంతో ప్రస్తుతం ‘రామాయణ’ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సినీప్రియుల్లో మరింత పెరిగింది.
ఇక ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భారీ తారాగణం, భారీ నిర్మాణ విలువలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించబోతుందో చూడాలి.








