కాకినాడ జిల్లా సామర్లకోట పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం ప్రేయర్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని బేతేలు చర్చి పాస్టర్ వీధి సామ్యూల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బైబల్ గ్రంథంలోని దేవునిని జ్ఞానం కోసం ప్రార్థించడం అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్, రాబోయే పది పరీక్షల్లో దేవుని ఆశీస్సులతో మంచి ఫలితాలు సాధించాలని ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ లో పాల్గొన్న 100 మంది విద్యార్థులకు పాస్టర్ పెన్నులు అందజేశారు.








