ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి శివారులో గుండాట స్థావరంపై ఎస్సై లక్ష్మికాంతం తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నుంచి రూ.15700 నగదు,9 పాచికలు,గుండాట ఫ్లెక్సీతో పాటు గుండాట సామాగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.అసాంఘిక కార్యకలాలపై నిరంతర నిఘా కొనసాగు తుందన్నారు.మండలంలో కోడిపందాలు,గుండాట,పేకాట వంటి జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.








