కరప గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పి విష్ణు కుటుంబం సర్వం కోల్పోయరు.కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అధ్యక్షులు డాక్టర్ మొండి రవి కుమార్ దృష్టికి తీసుకునివెళ్ళారు.దాంతో సంస్థ ప్రతినిధులు బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు,గృహోపకరణాలు ,రూ.5,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయూత ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జొన్నగడ్డ రాజు,దేవు వెంకటేశ్వరరావు,కోన వెంకట లక్ష్మి,చింతా నారాయణమూర్తి, అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి నిత్యావసర వస్తువులు, దుస్తులు, నగదును అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.









