సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు భారీ అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్టులు కూడా మధ్యలోనే ఆగిపోతుంటాయి. అలాంటి అరుదైన సంఘటనల్లో ఒకటి రామ్ చరణ్ కెరీర్లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి ప్రారంభించిన ‘మెరుపు’ సినిమా కేవలం 15 రోజుల షూటింగ్కే ఆగిపోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది
‘మెరుపు’ అనే ఈ స్పోర్ట్స్ డ్రామా, మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ ఎంతో ఎక్సైట్మెంట్తో ఒప్పుకున్న ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో ఈ సినిమా 2010 ఏప్రిల్ 30న ఘనంగా ప్రారంభమైంది. అదే కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందనే నమ్మకంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మొదట హీరోయిన్గా షాజన్ ను ఎంపిక చేసినా, ఫోటోషూట్ తర్వాత ఆమెను మార్చి కాజల్ ను తీసుకున్నారు. అయితే డేట్స్ సమస్యల వల్ల కాజల్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. చివరికి ఇలియానా ను ఫైనల్ చేశారు.
ఇక బడ్జెట్ విషయానికి వస్తే, మొదట 35 కోట్లతో ప్లాన్ చేసిన ఈ సినిమా, తర్వాత అదనంగా 10 కోట్లు పెరిగింది. ఇది నిర్మాతకు పెద్ద టెన్షన్గా మారింది.
ఇదే సమయంలో ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో మరింత రిస్క్ తీసుకోవడానికి నిర్మాత వెనుకంజ వేశాడు. అయినా సరే, ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరిగాయి.
చెన్నైలో 15 రోజులపాటు షూటింగ్ జరిపి, సుమారు 8 కోట్ల ఖర్చుతో తీసిన ఫుటేజ్ను చిరంజీవికి చూపించారు. అయితే ఆ అవుట్పుట్ ఆయనను మెప్పించలేకపోయింది. స్క్రిప్ట్లో మార్పులు చేయాలని సూచించినప్పటికీ, నిర్మాత మాత్రం ఈ ప్రాజెక్ట్పై మరింత పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదు.
దాంతో చివరకు ‘మెరుపు’ సినిమాను పూర్తిగా నిలిపివేసి, తర్వాత రచ్చ ప్రాజెక్ట్ను ప్రారంభించారు.
అలా భారీ అంచనాలతో, మెగాస్టార్ ఆశీర్వాదంతో ప్రారంభమైన ‘మెరుపు’ సినిమా కేవలం 15 రోజుల్లోనే ఆగిపోవడం టాలీవుడ్లో ఒక షాకింగ్ ఉదాహరణగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా పూర్తయ్యి ఉంటే ఎలా ఉండేదో అని అభిమానులు ఊహించుకుంటూనే ఉంటారు.








