Search
Close this search box.

  చిరంజీవి 158లో కొత్త హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..!

June 9, 2026 8:19 AM | Aditya369 News

చిరంజీవి 158లో కొత్త హీరోయిన్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

 

సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మొదట మలయాళ బ్యూటీ హనీ రోజ్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ భావించారట. అయితే ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్రబృందం ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.

 

తాజా సమాచారం మేరకు, రచితా రామ్ ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘కూలీ’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్, పాజిటివ్ షేడ్స్‌తో పాటు నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్‌గా మారనుంది.

 

తెలుగు ప్రేక్షకులకు కూడా రచితా రామ్ కొత్త కాదు. గతంలో ‘సూపర్ మచ్చి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పుడు మెగాస్టార్ ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

 

ఇక ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

 

సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, బాబీ కొల్లి మరోసారి చిరంజీవిని పూర్తి మాస్ అవతార్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

 

సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మొదట మలయాళ బ్యూటీ హనీ రోజ్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ భావించారట. అయితే ఆమె డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్రబృందం ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.

 

తాజా సమాచారం మేరకు, రచితా రామ్ ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘కూలీ’ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్, పాజిటివ్ షేడ్స్‌తో పాటు నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద ప్లస్‌గా మారనుంది.

 

తెలుగు ప్రేక్షకులకు కూడా రచితా రామ్ కొత్త కాదు. గతంలో ‘సూపర్ మచ్చి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఇప్పుడు మెగాస్టార్ ప్రాజెక్ట్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

 

ఇక ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ యువ నటి అనస్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

 

సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, బాబీ కొల్లి మరోసారి చిరంజీవిని పూర్తి మాస్ అవతార్‌లో చూపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు