కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పటి నుంచో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో.. “డియర్ అన్బానా ఫ్యాన్స్… మన సెలబ్రేషన్స్ను మరింత పెద్దగా కొనసాగించడానికి సిద్ధంగా ఉండండి. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను శాసించడానికి వస్తోంది” అంటూ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.
2026 ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్ను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే వరుస వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సూర్య.. ఈ సినిమాలో మరో కొత్త అవతార్లో కనిపించనున్నాడని టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డ్రామాతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
‘తొలిప్రేమ’, ‘సార్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనదైన స్టైల్ను నిరూపించుకున్న వెంకీ అట్లూరి.. ఈ సినిమాను కూడా క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. కథలో తండ్రి-కొడుకుల భావోద్వేగాలు హైలైట్ కానున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.
తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. మరి 2026 ఆగస్టులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఎలాంటి బాక్సాఫీస్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.








