కరపలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. గురజనాపల్లి హై స్కూల్ లో హెచ్ ఎం ఏ.సాయి మోహన్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి కూటమి పార్టీల నాయకులు నివాళ్ళు అర్పించారు. కరప మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు ఆశాదీపంగా, చదువు ద్వారానే అభివృద్ధి చెందుట జరుగుతుంది అని జ్యోతిరావు పూలే ఆశించి, తన జీవితాన్ని ఆ ఆశయ సాధనకు అంకితం చేసిన మహానుభావుడు అని తెలిపారు. సొసైటీ చైర్మన్ సైనవరపు భవాని శంకర్, ఎస్సీ సెల్ నాయకుడు మెండు గోవిందు, యాళ్ల పండు, జెల్లా శివకుమార్, నక్క అంజి, పి తణుకుల రాజు,వైసిపి నాయకులు జడ్పిటిసి యాళ్ల సుబ్బారావు, చింత ఈశ్వరరావు నక్క సత్తిబాబు, నాగల బాలాజీ నివాళ్ళు అర్పించిన వారిలో ఉన్నారు.








