పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)డాక్టర్ గా పని చేస్తున్న కర్రి చంద్రరేఖ (30) నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య కు పాల్పడింది.
అధిక మొతాదులో నిద్ర మాత్రలు మింగ గా పాలకొల్లు లోని ప్రవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ డాక్టర్ చంద్రరేఖ మృతి చెందింది.ఇటీవల పెళ్లి సంభందం కుదిరి పెళ్ళికి ముహర్తం పెట్టేందుకు పెద్దల ప్రయత్నం చేయడంతో ఆమె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ దారుణానికి పాల్పడిందని అనుమానిస్తున్నారు.
మొగల్తూరు మండలం ముళ్ళపర్రు చెందిన చంద్రరేఖ దొడ్డిపట్ల లో నివాసముంటూ పి హెచ్ సి లో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు








