స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’ మంచి ఆదరణతో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం త్వరలో హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
విజయ్ దేవరకొండ ఈ సక్సెస్ మీట్కు హాజరవుతారనే వార్త బయటకు రావడంతో, వీరిద్దరి అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ వేదికపైనే విజయ్, రష్మికలు తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించి, అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, అంతేకాకుండా వీరికి ఇప్పటికే రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశాలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ మధ్యే ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన రష్మిక, తాను విజయ్నే పెళ్లి చేసుకుంటాననే అర్థం వచ్చేలా చిన్న హింట్ ఇవ్వడం అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ‘ది గర్ల్ఫ్రెండ్’ సక్సెస్ మీట్కు విజయ్ హాజరవుతున్నారనే ప్రచారం ఈ పెళ్లి వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే, సినిమా బృందం లేదా విజయ్-రష్మికల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









