Search
Close this search box.

  కన్ఫ్యూజన్ లో చెర్రీ..? త్రివిక్రమా, సుకుమారా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఈ సంవత్సరం శంకర్ డైరెక్షన్లో “గేమ్ ఛేంజర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.. ప్రస్తుతం రాంచరణ్ “ఉప్పెన” ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనాతో కలిసి “పెద్ది” అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది… ఈ సినిమా మీద బజ్ రోజు రోజుకూ పెరిగిపోతుంది..ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యి భారీ హైప్ క్రియేట్ చేసింది.. ఇక సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది.. “పెద్ది” సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 40% షూటింగ్ పార్ట్ పూర్తయింది. జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.. అలాగే శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం 2026 మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది..ఐతే రామ్ చరణ్ చేయబోయే నెక్స్ట్ సినిమా పై న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..”పెద్ది” తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే అంశంపై భారీ ఆసక్తి నెలకొంది. ముందుగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను చేయాల్సి ఉంది.. కానీ ఇంకా స్క్రిప్ట్ పూర్తి కాలేదు అని సమాచారం.. ఐతే మరో డైరెక్టర్

త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు న్యూస్ జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ కాంబో కోసం ఎప్పటి నుండో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు… ఐతే RC17 సినిమాకు పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. అంతే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి..! దీంతో చరణ్ కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. రామ్ చరణ్ తో సినిమా చేయాలని సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ ఎప్పటి నుండో ట్రై చేస్తున్నారు.. ఇప్పుడు నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్, నాగవంశీ ఈ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు