Search
Close this search box.

  భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు.నాసా ప్రకారం భూమి మీదకు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది. 10 నెలలుగా అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతు న్నారు.గత కొన్నినెలల క్రితమే కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు ఇద్దరు అంతరిక్షానికి పయనమైయ్యారు.గత సంవత్సరం జూన్ 5న ఫ్లోరిడా లో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.కానీ, ఫలితం శూన్యం.చేసేది ఏమిలేక వ్యోమగాముల ను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమిపైకి తిరిగి వచ్చింది.దాంతో ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు