Search
Close this search box.

  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను  ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో కలిపి 10 మంది పదవీకాలం ముగియ నుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామ కృష్ణుడు,జంగా కృష్ణమూర్తి, పి.అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది.

తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి , ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల భర్తీకి షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు ఇవే

ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10

నామినేషన్ల పరిశీలన: మార్చి 11

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13

పోలింగ్: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు