హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగానే, అమరావతి రింగ్ రోడ్ నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్ ఉంటుందని అంటున్నారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
