ఈ నెల 19న తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరుగనుంది.ఈ సమావేశంలోపార్టీ రాష్ట్ర కార్యవర్గం,జిల్లా అధ్యక్షులు,ప్రస్తుత,మాజీ ఎంపీలు,శాసనమండలి సభ్యులు,శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు,జిల్లా పరిషత్ చైర్మన్లు,డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొననున్నారు.పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు సభ్యత్వ నమోదు,నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
