కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’అవార్డును ప్రదానం చేసింది.అతి పిన్న వయస్సులో ఎంపీగా,కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు.ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.









