నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుభ వార్త అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000 ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు.బీహార్లోని బెట్టియా జంక్షన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన నమో,వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.
