క్రైస్తవులందరూ ఐకమత్యంతో ఉండడం ద్వారానే తమ హక్కులను సాధించుకోగలరని సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ పేర్కొన్నారు. సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ లో వున్న ట్రూ గోస్పెల్ బాప్టిస్ట్ సంఘం నందు సామర్లకోట పరిసర ప్రాంతాల్లోని బాప్టిస్ట్ సంఘ కాపర్లు, నాయకులు ఆధ్వర్యంలో “ది సామర్లకోట బాప్టిస్ట్ ఫీల్ కౌన్సిల్” ప్రారంభించారు. సత్య సువార్త బాప్టిస్ట్ సంఘ కాపరి డాక్టర్ సత్య సువార్త రాజు దైవ సందేశాన్ని ఇచ్చారు. సుమారు 16 సంఘము లకు చెందిన సంఘ కాపరులు, క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.









