కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జరుగుతున్న సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన మార్గం వద్ద భక్తులను ఆలయం లోపలికి పంపే క్రమంలో తోపులాట జరిగింది. పోలీస్ సిబ్బంది తక్కువుగా ఉండడంతో భక్తులను నిలువరించడం ఇబ్బందికరంగా మారింది.









