ప్రాచీన కాలం నుంచి అత్యంత ప్రజాదరణ పొంది, ప్రస్తుతం అంతరించిపోతున్న తోలుబొమ్మలాటకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ద్వారా తోలుబొమ్మలాటపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్న కాకినాడ రూరల్ జముననగర్ కి చెందిన తోట బాలకృష్ణ చేస్తున్న కృషిని గుర్తించింది.ఇటీవల ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి(యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్) పాండిచ్చేరిలో కళా రత్న అవార్డ్ ప్రధానం చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్..తోట బాలకృష్ణ దంపతులను సత్కరించారు. తోలు బొమ్మలాట కళలో అత్యంత ప్రావీణ్యం సంపాదించారని ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధానం చేసిన సర్టిఫికేట్, షిల్డ్ ను జిల్లా కలెక్టర్ బాలకృష్ణ దంపతులకు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
