పాన్ ఇండియా ట్రెండ్లో ఇప్పుడు సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా నుంచి వస్తున్న సీక్వెల్స్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అలాంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ‘జై హనుమాన్’.
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ‘హనుమాన్’ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా, స్టార్ డైరెక్టర్గా నిలబెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. మొదటి భాగం చివర్లోనే ఇచ్చిన హింట్తో పార్ట్-2పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను 2025లో తీసుకువస్తామని గతంలో ప్రకటించినప్పటికీ… ఇప్పుడు 2026 సగం దాటిపోయినా సినిమా నుంచి ఒక్క అధికారిక అప్డేట్ కూడా రాలేదు. దీంతో అభిమానులు కాస్త అసహనంగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా… గ్రౌండ్ లెవెల్లో మాత్రం ‘జై హనుమాన్’పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ‘హనుమాన్’ సంచలన విజయం సాధించడంతో, రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? రిలీజ్ ఎప్పుడు? అనే విషయాలపై మేకర్స్ నుంచి స్పష్టత రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరి ప్రశాంత్ వర్మ టీమ్ ‘జై హనుమాన్’పై ఎప్పుడు అధికారిక అప్డేట్ ఇస్తుందో చూడాలి.








