కరపలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (జేఏసీ) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవదిక సమ్మెలో భాగంగా ఆరవ రోజు కరప బ్రాంచ్ పరిధిలోని ఐదు సొసైటీల సీఈఓలు,సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెకు విచ్చేసి కరప సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్ సంఘీభావం ప్రకటించారు.ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాయుడు వెంకటేశ్వరరావు,బచ్చు పరశురాం,నల్ల వెంకటేశ్వరరావు,వై జె చంద్రశేఖర్,వాసంశెట్టి శివ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









