కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం జంక్షన్- ఆర్టిసి బస్ స్టాప్ వద్ద కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్ స్టాప్ వద్ద ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారంగా హెవీ లోడుతో టిప్పర్లు తిరగడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రోడ్డులో వాహనదారులు అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.









