పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానము (పాదగయ) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి టి మాధవిదేవి దంపతులు దర్శించుకున్నారు.వారికి జిల్లా దేవదాయ శాఖ అధికారి కె నాగేశ్వరరావు,ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణికుమార్ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు.అనంతరం వారు దత్తాత్రేయ స్వామి,కుక్కుటేశ్వర స్వామి రాజరాజేశ్వరిఅమ్మవార్లను దర్శనం చేసుకుని విశేష పూజలు ఆచరించారు.అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్త్రాలు,ప్రసాదాలు అందచేశారు.








