పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం(పాదగయ) హుండీ లెక్కింపు కార్యక్రమం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చాగంటి సురేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారులు బి ధనలక్ష్మి,కె రవితేజ పర్యవేక్షణలో జరిగింది.ఈ సందర్భంగా ఆలయ సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ 17 రోజులకుగాను ఆలయ హుండీల ద్వార
రూ12,07,546/-,అన్నదానం హుండీ ద్వార 14,341/- వెరసి రూ12,21,887/-లు ఆదాయం వచ్చిందని తెలిపారు









