సాధారణంగా పిఠాపురం పట్టణంలో 30 వార్డుల్లో రోజుకి 25 టన్నుల చొప్పున చెత్త సేకరణ జరుగుతుంది. అయితే మహాశివరాత్రి సందర్భంగా ఉత్పత్తి అయిన చెత్త 70 టన్నులు పైగానే, నిత్యం సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పిఠాపురంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా వచ్చిన భక్తులు పారిశుద్ధ్య విషయంలోనూ తమకు సహకరించాలని కోరుతున్నారు.








