కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయలో లింగోద్భావ కాలాభిషేక పూజకు హాజరైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గర్పాలయంలో జరిగే ఈ పూజను వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయం లోపల కిక్కిరిసిపోయింది. భక్తులు లింగోద్భావ కాలాభిషేక పూజను వీక్షించేందుకు నానా వస్థలు పడ్డారు. కనీసం ఆలయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన ఇంత ఇబ్బంది ఉండేది కాదని, భక్తులు అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.









