పిఠాపురం మున్సిపాల్టీలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు ఇకపై 120 మంది కార్మికులు రాను న్నారు. ఈమేరకు పిఠాపురం మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల పెంపు అంశంపై కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకూ 72 మంది పనిచేస్తున్నప్పటికీ, కొంత మంది సెలవులు, మరికొంత మంది ఇతర పనులపై వెళ్లడం వల్ల నిర్వాహణ సరిపోవడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ముందుగా కౌన్సిల్ అభిప్రాయంతో కార్మికుల పెంపు చర్యలకు ఉపక్రమించింది.









