కాకినాడ కలెక్టరేట్లో ఆదివారం డిఆర్ఓగా డాక్టర్ డి తిప్పేనాయక్ బాధ్యతలు స్వీకరించారు.2024 ఎన్నికల్లో కాకినాడ డీఆర్ఓగా బాధ్యతలు నిర్వహించి అనంతరం బదిలీపై అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.అక్కడ సుమారు 14 నెలల పాటు విధులు నిర్వహించి మరలా జిల్లాకు డీఆర్ఓగా వచ్చారు.ఈ సందర్భంగా డీఆర్ఓను కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు,అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు డిఆర్ఓగా పనిచేసిన జె వెంకటరావు సింహాచలం దేవస్థానం ఈవో గా బదిలీపై వెళ్ళారు.









