పెనుకుదురు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద గురచనాపల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 80 మందికి పైగా ప్రజలు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు.అనంతరం రోగులకు ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు.శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యే పంతం నానాజీ,జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళీ కి డాక్టర్ దివ్య ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వ ఆయుర్వేద సిబ్బంది ఎం.ఎస్ కృష్ణమూర్తి,లోవరాజు పాల్గొన్నారు.









