పిఠాపురం ఏరియా డవలప్మెంట్ అథారిటీ(పాడా) పరిధిలోని ఉన్న కొత్తపల్లి మండలం, గొల్లప్రోలు తాగునీటి పథకానికి రూ.10.91 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ నిధుల మంజూరు జీవో విడుదల చేశారు. కొత్తపల్లి మండలం నాగులాపల్లి మంచినీటి పథకానికి రూ.6.99 కోట్లు, అదనపు వాటర్ ప్లాంట్, పంపు సెట్లకు రూ.1.23 కోట్లు, ఇసుకపల్లిలో పైపులైన్ల నిర్మాణానికి రూ.1.37 కోట్లు, గొల్లప్రోలు మండలం మల్లవరం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఫెన్సింగ్ పనులకు రూ.1.32 కోట్లు నిధులను మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అభివృద్ధి పనులకు, నిధులు పుష్కలంగా వస్తున్నాయని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









