మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేస్తూ నిర్వహించబోయే మండల సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరకుల సింహాచలం పిలుపునిచ్చారు.మంగళవారం విరవాడ, నర్సింగపురం, జములపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన విబిజిఆర్ఎంజి పథకం గ్రామీణ పేదల ఉపాధిని నిర్వీర్యం చేసేలా ఉందన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం మండలంలోని జములపల్లి గ్రామంలోని రామాలయం వద్ద సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు జిల్లా నాయకులు హాజరవుతారని కూలీలు,ప్రజలుపాల్గొని జయప్రదం చేయాలన్నారు.









